నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి
కబురునందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా
ఇవాళ గ్రూప్-2 నోటిఫికేషన్ను విడుదల చేసింది. 439 పోస్టులకు
నోటిఫికేషన్ను జారీ చేస్తోన్నట్టు పేర్కొంది. ఉద్యోగార్థులు రేపటి నుంచి
ఫిబ్రవరి 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. ఏప్రిల్
24, 25 తేదీల్లో ఉద్యోగాల భర్తీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది.
No comments:
Post a Comment